Chiranjeevi: ప‌వ‌న్ రమ్మ‌న‌లేదు.. నేను రాను

Chiranjeevi says he is not campaigning from pithapuram

Chiranjeevi: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) కోసం పిఠాపురంలో ప్ర‌చారం చేస్తార‌ని వ‌స్తున్న రూమ‌ర్స్‌పై స్పందించారు మెగాస్టార్ చిరంజీవి. ఈరోజు ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు అందుకున్న ఆయ‌న మీడియాతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా త‌న త‌మ్ముడు ప‌వ‌న్ రాజ‌కీయ ప్రయాణం గురించి కూడా ప్ర‌స్తావించారు. త‌న‌ను ప‌వ‌న్ పిఠాపురం వ‌చ్చి ప్ర‌చారం చేయండి అని త‌న‌ను అడ‌గ‌లేద‌ని.. కాబ‌ట్టి తాను రాద‌ల‌చుకోలేద‌ని తెలిపారు. ప‌వన్ ఎప్పుడూ కూడా ఇది చేయండి అని చెప్ప‌డ‌ని.. త‌న కంఫ‌ర్ట్‌కే వ‌దిలేస్తాడ‌ని పేర్కొన్నారు.

ఇక భార‌త‌ర‌త్న గురించి మాట్లాడుతూ.. ప‌ద్మ‌విభూష‌ణ్ వచ్చిన‌ట్లుగానే ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వ‌స్తుంద‌ని.. దాని కోసం ప్రాకులాడాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపారు. అయితే దివంగ‌త న‌టుడు నంద‌మూరి తార‌క రామారావుకు మాత్రం భార‌త‌ర‌త్న రావాల‌ని తాను కూడా కోరుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు.