Jagan: బెయిల్‌పై విడుద‌లై నేటికి ప‌దేళ్లు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (jagan) జైలు నుంచి బెయిలుపై విడుదల అయ్యి నేటికి 10 ఏళ్లు పూర్త‌వుతోంది. ఈనేప‌థ్యంలో నారా లోకేష్ (nara lokesh) సెటైర్ వేస్తూ చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

“” బెయిల్ డే ప‌దో వార్షికోత్స‌వ‌ శుభాకాంక్ష‌లు జైలు మోహ‌న్. 42 వేల కోట్లు ప్ర‌జాధ‌నం దోచేసి, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 అయినా ప‌దేళ్లుగా బెయిలుపై ఉన్న ఆర్థిక ఉగ్ర‌వాది జైలు మోహ‌న్‌ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ల్ని ధ్వంసం చేస్తూ, రాజ్యాంగాన్ని కాల‌రాస్తూ, నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నాడు . జైలులో ఉండాల్సిన జ‌గ‌న్ ప‌దేళ్లుగా బెయిలుపై ఉంటే, జ‌నంలో ఉండాల్సిన నిజాయితీప‌రుడు సీబీఎన్ జైలులో ఉన్నారు “” అని ట్వీట్ చేసారు లోకేష్.