Chandrababu Naidu: ఎన్నికల‌కు ముందు షాక్..!

Chandrababu Naidu: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడుకు ఎన్నిక‌ల ముందు భారీ షాక్ త‌గిలింది. అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో సీఐడి ఛార్జ్ షీటు దాఖలు చేసింది. రూ.4400 కోట్ల స్కామ్ జరిగినట్లు నిర్ధారించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా చంద్రబాబును, మాజీ మంత్రి నారాయణను మరో ముద్దాయిగా పేర్కొంది. మొత్తం 1100 ఎకరాల అసైన్డ్ భూముల స్కామ్ జరిగినట్లు సీఐడీ తెలిపింది. రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూములు కాజేసినట్లు తేల్చింది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో ఇది చంద్ర‌బాబుకు పెద్ద షాకే అని చెప్పాలి.