TDP NDA Meet: మోదీతో బాబు భేటీ.. లోక్ స‌భ స్పీక‌ర్ ప‌ద‌వి అడిగే అవ‌కాశం

chandrababu naidu to seek speaker post

TDP NDA Meet: ఈరోజు తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఢిల్లీలో ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర‌మంత్రులు అమిత్ షా, జేపీ న‌డ్డాల‌తో స‌మావేశం కానున్నారు. కేంద్రంలో ఎన్డీయే కూట‌మి గెలిచిన‌ప్ప‌టికీ మెజారిటీ రాలేదు. దాంతో జేడీయూ, తెలుగు దేశం పార్టీలు కింగ్ మేక‌ర్‌గా అవ‌త‌రించ‌నున్నాయి. ఇప్పుడు అవ‌స‌రం తెలుగు దేశం పార్టీది కాదు. ఎన్డీయే కూట‌మిది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు నాయుడు మోదీతో భేటీ కానున్న స‌మ‌యంలో తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియ‌ర్ అభ్య‌ర్ధికి లోక్ స‌భ స్పీక‌ర్ ప‌ద‌విని అడిగే అవ‌కాశం ఉంద‌ని అంత‌ర్గ‌త వ‌ర్గాల స‌మాచారం. ఇందుకు మోదీ ఒప్పుకుంటే.. తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌ల్లో ఆ మ‌హోన్న‌త ప‌ద‌వి ఎవ‌రికి వ‌స్తుందా అనే అంశంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.