Chandrababu Naidu: పిచ్చి కుక్క అని అరిచి.. మంచి కుక్క‌ను చంపేసారు

Chandrababu Naidu talks about polavaram project

Chandrababu Naidu: జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కార‌ణంగానే పోల‌వ‌రం ప్రాజెక్ట్ నాశ‌నం అయిపోయింద‌ని అన్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. పిచ్చి పిచ్చి అని అరిచి.. మంచి కుక్క‌ను చంపేసిన‌ట్లు.. పోల‌వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జ‌రిగింది అని ఆరోపిస్తూ ఏకంగా ప్రాజెక్ట్‌నే నాశ‌నం చేసార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఈ మేర‌కు పోల‌వ‌రం ప్రాజెక్ట్‌కు సంబంధించి శ్వేత‌ప‌త్రాన్ని విడుద‌ల చేసారు.

పోల‌వరంలో అవినీతి జ‌ర‌గ‌లేదు అని కేంద్ర‌మే రిపోర్ట్ ఇచ్చింద‌ని.. మ‌రి కేంద్రానికి కూడా క‌నిపించ‌ని అవినీతి జ‌గ‌న్‌కు ఎలా క‌న‌ప‌డిందో అని సెటైర్ వేసారు. తాను ఊహించిన‌దానిక‌న్నా పోల‌వ‌రం ఎక్కువ దెబ్బ‌తింద‌ని.. పోల‌వ‌రం నిర్మాణాల‌ను చూస్తే ఏడుపొచ్చింద‌ని తెలిపారు. కేంద్ర సాయం, అంత‌ర్జాతీయ నిపుణుల సూచ‌న‌ల‌తో పోల‌వ‌రం ప్రాజెక్ట్ ప‌నులు ఎలా మొద‌లుపెట్టాలో ఆలోచించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వెల్ల‌డించారు.