AP Assembly: 164 క‌లిపితే 11.. అసెంబ్లీలో చంద్ర‌బాబు సెటైర్

chandrababu naidu talks about 11 seats in ap assembly

AP Assembly: ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాలు మొద‌లై నేటికి రెండో రోజు. ఈరోజు స్పీక‌ర్‌గా అయ్య‌న్న పాత్రుడిని విప‌క్ష పార్టీ మ‌ర్యాద‌పూర్వ‌కంగా స్పీక‌ర్ సీటులో కూర్చోబెట్టాల్సి ఉంటుంది. కానీ అలా చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిరాక‌రించారు. ఆయ‌న అస‌లు అసెంబ్లీకి రాలేదు. ఈరోజు పులివెందుల వెళ్ల‌నున్నాన‌ని అందుకే అసెంబ్లీకి రాలేక‌పోతున్నాన‌ని అన్నారు. అయితే.. ఈరోజు అసెంబ్లీలో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. సీఎం చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ.. గ‌తంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే 23వ తేదీ 23 సీట్లు వ‌చ్చాయని ఎగ‌తాళి చేసార‌ని.. మ‌రి ఈరోజు కూట‌మికి 164 సీట్లు వ‌చ్చాయ‌ని.. 164 క‌లిపినా 11 వ‌స్తుంద‌ని ఇది దేవుడి స్క్రిప్ట్ అని నేను అనగలను కానీ ఆ మాట నేను అనను అన్నారు. దాంతో అసెంబ్లీలోని ఇత‌ర నేత‌లు ఫ‌క్కున న‌వ్వుకున్నారు.