Chandrababu Naidu: పిచ్చి కుక్క‌ను ఏం చేయాలి? జ‌గ‌న్‌పై కామెంట్స్

Chandrababu Naidu: జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని (Jagan Mohan Reddy) పిచ్చి కుక్క‌తో పోలుస్తూ కామెంట్స్ చేసారు తెలుగు దేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు. వివేకా హ‌త్య కేసులో ష‌ర్మిళ‌, సునీత రెడ్ల‌ను త‌న వైపుకు తిప్పుకున్నాన‌ని అంటున్నాడ‌ని.. హాలీవుడ్‌, బాలీవుడ్ సినిమాల‌ను మించిపోయే ట్విస్ట్‌లు జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని అన్నారు. మ‌న వీధిలోకి పిచ్చి కుక్కో, దొంగో వ‌స్తే రాళ్ల‌తో కొట్ట‌కుండా ఊరుకుంటామా అంటూ జ‌గన్‌పై రెచ్చిపోయారు. ఈసారి ఈ సైకోకు ఓటు వేస్తే రాష్ట్రం ఇంకా స‌ర్వ నాశ‌నం అయిపోతుంద‌ని అన్నారు.

“” వివేకా చ‌నిపోయిన‌ప్పుడు సాక్షిలో గుండెపోటు అని రాసారు. ఆ త‌ర్వాత నోట్లో నుంచి రక్తం అన్నారు. ఆ త‌ర్వాత నా చేతిలో గొడ్డ‌లి పెట్టి నేను చంపాను అన్నాడు. ఇప్పుడు మ‌ళ్లీ ఎన్నిక‌లు రాగానే నిందితుడు మ‌న మ‌ధ్యే ఉన్నాడు అంటూ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తున్నాడు. పాపం సునీత న్యాయం కోసం ఎంతో పోరాడుతోంది. ఈ పిచ్చి కుక్క‌ను ఓట్లు వేయ‌కుండా త‌రిమి కొట్టాలి “” అంటూ ఆగ్ర‌హంతో ఊగిపోయారు చంద్ర‌బాబు.

ALSO READ: YS Sunitha Reddy: చిన్నాన్న ఎన్నిక‌ల స‌మ‌యంలో గుర్తొచ్చాడా?