Chandrababu Naidu: అమ‌రావ‌తిలో జ‌గ‌న్‌ను ఆయ‌న నేత‌ల‌ను పూడ్చాలి

Chandrababu Naidu says jagan must be drowned in amaravathi

“” ఈ వ‌ర‌ద‌ల‌కు అమ‌రావ‌తి మునిగిపోయిందా? ఎవ‌రు చెప్పారు మునిగిపోయింద‌ని? ఈ జ‌గ‌న్‌ను ఆయ‌న పార్టీ నేత‌ల‌ను తెచ్చి ముంచాలి. అమ‌రావ‌తిని శ్మశానం అంటున్నారు. అయితే అక్క‌డే వీరిని పూడ్చాలి. చేసేవి వెధ‌వ ప‌నులు. మ‌ళ్లీ నాపై బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద‌లకు కొంత‌ కార‌ణం కృష్ణా న‌ది పొంగ‌డం అయితే.. ఎక్కువ శాతం బుడ‌మేరు పొంగ‌డ‌మే. ఇందుకు కారుణం బుడ‌మేరు నీరు కొల్లేరులోకి వెళ్ల‌నివ్వ‌కుండా 2019 నుంచి అక్ర‌మంగా నిర్మాణాలు, భూక‌బ్జాల‌కు పాల్ప‌డి నీటిని పార‌కుండా ఆపేయ‌డ‌మే. ఆ స‌మ‌యంలో గాడిద‌లు కాసారా? ప‌ట్టించుకోరా?

చేసిన‌వ‌న్నీ చేసి మ‌ళ్లీ నాపై బుర‌ద జ‌ల్లుతారా? త‌ప్పు చేసి ప్ర‌జ‌ల‌కు దొరికిపోతామ‌న్న భయంతో సైలెంట్‌గా ఉంటే నేను కూడా ఊరుకుంటా. అలా కాకుండా త‌ప్పు చేసి మ‌ళ్లీ అది నాపై వేయాల‌ని చూస్తే అస్స‌లు వ‌దిలిపెట్ట‌ను. ఇంకా జ‌గ‌న్‌కు సిగ్గు రాలేదు. ప్ర‌జ‌లు వింటున్నార‌ని ఎదురుదాడి చేస్తారా? అలా చేస్తే ప్ర‌జ‌లే చూసుకుంటారు. ఇలాంటివారిని బ‌హిష్క‌ర‌ణ చేయాలి. ఇప్పటికే విజ‌య‌వాడ‌లో కాస్త ప‌రిస్థితి శాంతించింది. రేప‌టికి అంతా సాధార‌ణం అయిపోతుంది. ఇప్ప‌టికే ఆహారం, పాలు, నీళ్లు, మందులు వంటివి అందిస్తున్నాం. రేపు కూర‌గాయ‌లు, బియ్యం, ప‌ప్పుదినుసులు కూడా పంపిణీ చేస్తాం. ఈ స‌మ‌యంలో కూర‌గాయ‌ల ధ‌ర‌లు పెంచేస్తారు.

అందుకే ముందే ఆలోచించి మేమే పెద్ద ఎత్తున కూర‌గాయ‌ల‌ను డంప్ చేసుకున్నాం. దానికి మార్కెట్ ధ‌ర‌ను నిర్ణ‌యిస్తాం. ఆ ధ‌ర‌కే అమ్మాలి. ప్రైవేట్ బోట్లు న‌డిపే వారు డ‌బ్బులు అడుగుతున్నార‌ని తెలిసింది. అలా చేయ‌కండి. ఈ స‌మ‌యంలో ఆదుకోండి. మీకు కావాల్సిన డ‌బ్బులు మేమే ఇస్తాం. అలా కాకుండా మీరు డ‌బ్బులు అడుగుతున్న‌ట్లు తెలిస్తే త‌ప్ప‌కుండా జైల్లో పెట్టిస్తా“” అని వెల్ల‌డించారు.