Chandrababu Naidu: శ‌ని ప‌ట్టిన పోల‌వ‌రాన్ని 2027 నాటికి పూర్తి చేస్తాం

Chandrababu Naidu says jagan literally stopped polavaram project permanantly

“” ముంపు మండలాలు ఇవ్వకుండా పోలవరం ప్రాజెక్టు వద్దని ఆరోజే చెప్పాను. ఆ ఏడు మండలాలు ఇస్తేనే ప్రమాణం చేస్తానని చెప్పా. అది నా దూరదృష్టి. పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,157 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీక‌రించింది. పోలవరం విషయంలో ప్రధాని న‌రేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు. ఈ ఐదేళ్లు జ‌గ‌న్ చేసిన నిర్ల‌క్ష్యానికి పోల‌వ‌రం చుట్టూ కంప‌లు పెరిగిపోయాయి. కంప‌లు కొట్టించ‌డానికి అయిన ఖ‌ర్చు రూ.35 కోట్లు. బాధ్య‌త లేని పొగ‌రుతో వ్య‌వ‌హ‌రించే వ్య‌క్తి రాష్ట్రానికి సీఎం అయితే ఎంత న‌ష్టం జ‌రుగుతుందో ప్ర‌జ‌లు కూడా అర్థం చేసుకుంటే భ‌విష్య‌త్తులో ఇలాంటి వ్య‌క్తులు రాజ‌కీయాల్లోకి కూడా రాలేరు. ఎమ్మెల్యేగానే కాదు ఎక్క‌డ కూడా ఉండేందుకు అర్హ‌త లేదు “” అని తెలిపారు.