Chandrababu Naidu: కొత్త బిచ్చ‌గాడు వ‌చ్చాడ‌ని ఓట్లు వేసేసారు

chandrababu naidu satire on jagan during public meeting

Chandrababu Naidu: కొత్త బిచ్చ‌గాడు వ‌చ్చాడ‌ని ఓట్లు వేసేసారు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై కామెంట్స్ చేసారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. ఈరోజు శ్రీశైలం మ‌ల్లికార్జున స్వామిని ద‌ర్శించుకున్న చంద్ర‌బాబు ప‌బ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఒక‌ప్పుడు రాయ‌ల‌సీమ అంటే ర‌త‌నాల సీమ గుర్తొచ్చేద‌ని.. కానీ ఈరోజు జ‌గ‌న్ వ‌ల్ల అది కాస్తా రాళ్ల సీమ‌గా మారిపోయింద‌ని అన్నారు. తాను అధికారంలో ఉన్న‌ప్పుడు హైద‌రాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేసాన‌ని.. ఇంత డెవ‌ల‌ప్మెంట్ జ‌రుగుతోంది కాబ‌ట్టి.. కొత్త బిచ్చ‌గాడు (జ‌గ‌న్‌ను ఉద్దేశిస్తూ) వ‌చ్చాడ‌ని అత‌ని ప్ర‌జ‌లు పొర‌పాటున ఓట్లు వేసార‌ని.. తీరా చూస్తే అత‌ను అంతా దోచేసుకున్నాడ‌ని అన్నారు.

పొలాల్లోకి అడ‌వి పందులు వ‌స్తే త‌రిమికొడ‌తామ‌ని అదే విధంగా ఇలాంటి నాయ‌కుల‌ను త‌రిమికొట్టాల‌ని అన్నారు. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లకు ఎన్నో హామీలు ఇచ్చాను కానీ ఖాజానాలో ఖాళీగా ఉంద‌ని అన్నారు. రాబోయే కాలంలో క‌రువు అనే మాట విన‌ప‌డ‌కుండా చేస్తాన‌ని తెలిపారు.