ఎలా ఉన్నావ్ తాతా.. మ‌న‌వ‌డిని చూసి మురిసిపోయిన బాబు

చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు నుంచి బ‌య‌టికి రాగానే మ‌న‌వ‌డు దేవాన్ష్‌ని (nara devansh) చూసి మురిసిపోయారు. దాదాపు 54 రోజుల పాటు కుటుంబానికి దూరంగా ఉన్న చంద్ర‌బాబు మ‌న‌వ‌డిని హ‌త్తుకుని ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. బాబుని తీసుకెళ్లేందుకు బాల‌కృష్ణ‌, నారా లోకేష్, బ్రాహ్మ‌ణిల‌తో పాటు టీడీపీ కార్య‌క‌ర్త‌లు జైలు బ‌య‌ట పెద్ద ఎత్తున గుమిగూడారు.