Ambati Rambabu: మ‌ళ్లీ నంద‌మూరిపై నారా వారి కుట్ర‌లు

జైల్లో ఉంటూ కూడా చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) నంద‌మూరి (nandamuri) కుటుంబంపై కుట్ర‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు YSRCP నేత అంబ‌టి రాంబాబు (ambati rambabu). చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ అవ్వ‌గానే దాదాపు 100 మంది గుండెపోటుతో మృతిచెందాయ‌ని అన్నార‌ని.. వారి కుటుంబాల‌ను స్వ‌యంగా తానే వెళ్లి పరామ‌ర్శిస్తాన‌ని ఒక సంద‌ర్భంలో నంద‌మూరి బాల‌కృష్ణ (nandamuri balakrishna) మీడియా ద్వారా వెల్ల‌డించార‌ని కానీ ఇప్పుడు బాలకృష్ణ‌కు బ‌దులు చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి (nara bhuvaneswari) ఎందుకు ప‌రామ‌ర్శ‌కు వెళ్తున్నార‌ని ప్ర‌శ్నించారు.

బాల‌కృష్ణ ప‌రామ‌ర్శ‌కు వెళ్తే ఎక్క‌డ పార్టీ అధికారం నంద‌మూరి చేతుల్లోకి వెళ్లిపోతుందోన‌ని జైలు ములాఖాతుల్లోనే చంద్ర‌బాబు ప్లాన్ వేసార‌ని అంబ‌టి ఆరోపించారు. బాల‌కృష్ణ అమాయ‌కుడు కాబ‌ట్టి చంద్ర‌బాబు ఏం చెప్పినా కాద‌న‌డ‌ని.. కానీ ప్ర‌జ‌లకు మాత్రం బాగా అర్థం అవుతోంద‌ని తెలిపారు. చంద్ర‌బాబు త‌ప్పు చేసాడు కాబ‌ట్టే ఏ కోర్టుకు వెళ్తే ఆ కోర్టు ఎక్క‌డిక‌క్క‌డ కేసుల‌ను డిస్మిస్ చేస్తూ జ్యుడిషియ‌ల్ రిమాండ్‌ల‌ను పెంచుకుంటూ పోతోంద‌ని అన్నారు. చంద్ర‌బాబు నాయుడు జైలుకి వెళ్ల‌గానే అనారోగ్యం పాల‌య్యార‌ని అబ‌ద్ధాలు ఆడుతూ సానుభూతి పొందాల‌ని చూస్తున్నార‌ని విమ‌ర్శించారు. (ambati rambabu)