Chandrababu కి ఎన్నిక‌ల క‌మిష‌న్ నోటీసులు

Chandrababu: తెలుగు దేశం పార్టీ అధినేత‌ చంద్రబాబు నాయుడుకి కేంద్ర‌ ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి ఏపీ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి జగన్ మోహ‌న్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ నేప‌థ్యంలో 48 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ బాబుకి నోటీసులు జారీ చేసింది.