Chandrababu కేసు CBIకి.. పిల్ వేసిన ఉండవల్లి

చంద్రబాబు నాయుడు (chandrababu) కేసును CBIకి అప్పగించాలని ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ (undavalli arun kumar) ఏపీ హైకోర్టులో పిల్ వేసారు. 241 కోట్ల దారి మళ్లింపు, పూర్తి నిందితుల జాబితాతో సవివరంగా వివరాలు పొందుప‌రిచారు. సీమెన్స్ ఇండియా గుజరాత్ MOUలో పెట్టిన పేరు సంతకం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టిన పేరు సంతకం వేరు వేరుగా ఉన్నాయని తెలిపారు. దురుద్దేశ పూర్వకంగా, కుట్ర కోణంతో చంద్రబాబు నాయుడు సహకారంతో 241 కోట్ల దారి మళ్లింపు జరిగిందని మొత్తం నిందితుల బెయిల్ ఆర్డర్లలో జస్టిస్ సురేష్ కుమార్ రెడ్డి నిధుల దుర్వినియోగ విషయంలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి పూర్తిగా సహకరించాలి అని పేర్కొంటూ, నిందితుల సహకారం లేని పక్షంలో బెయిల్ రద్దుకు సీబీఐకి అనుమతి ఇచ్చారు. ఒక్క MOU తప్ప కేసుకి సంబందించిన అన్నీ డాక్యుమెంట్ల‌ను ఉండ‌వ‌ల్లి జత చేసారు. రిమాండ్ ఆర్డర్స్, రిమాండ్ రిపోర్ట్స్ సహా అన్నీ వివరాలు పొందుపరచి 44 మంది ప్రతివాదులను చేర్చారు.