Chandrababu Naidu: జ‌బ‌ర్ద‌స్త్ ఎమ్మెల్యే… రోజాపై చంద్ర‌బాబు పంచులు!

Chandrababu Naidu: న‌గిరి ఎమ్మెల్యే రోజాపై (RK Roja) తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పంచ్‌లు వేసారు. ప్ర‌జాగ‌ళం చేప‌డుతున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు రోజా నియోజ‌క‌వ‌ర్గం అయిన న‌గిరిలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. “” ఇక్క‌డ ఒక ఎమ్మెల్యే ఉన్నారు. జ‌బ‌ర్ద‌స్త్ ఎమ్మెల్యే. ఆమె మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇప్పిస్తాన‌ని చెప్పి భువ‌నేశ్వ‌రి అనే మ‌హిళ నుంచి డ‌బ్బు తీసుకుని మోసం చేసారు. ఇలాంటి ఆడ‌బిడ్డ‌ను ఆదుకుని జ‌బ‌ర్ద‌స్త్ ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పండి. న‌గిరిలో అన్నీ అరాచ‌కాలే జ‌రుగుతున్నాయి “” అన్నారు.