EXCLUSIVE: షర్మిళ కుమారుడి పెళ్లికి చంద్ర‌బాబు, లోకేష్‌?

EXCLUSIVE: వైఎస్ ష‌ర్మిళ  (ys sharmila) కుమారుడు రాజా రెడ్డి, ప్రియా అట్లూరిల వివాహం ఫిబ్ర‌వ‌రిలో జ‌ర‌గ‌నుంది. ఈ నెల‌లో వారి నిశ్చితార్ధం కానుంది. అయితే రాజా రెడ్డి, ప్రియ అట్లూరిల పెళ్లికి చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu), నారా లోకేష్ (nara lokesh) వెళ్ల‌నున్న‌ట్లు విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం.

ఇటీవ‌ల క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ష‌ర్మిళ నారా లోకేష్‌కు కానుక పంపడం ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. మ‌రోప‌క్క చంద్ర‌బాబు ప్లాన్ వేయ‌డం వ‌ల్లే ష‌ర్మిళ కాంగ్రెస్‌లో చేరింద‌ని నేత‌లు ఆరోపిస్తున్నారు. ఇప్ప‌టికైతే ష‌ర్మిళ‌కు తెలుగు దేశం పార్టీ నేత‌ల‌కు ఎలాంటి విభేదాలు లేవు. సో.. ష‌ర్మిళ కుమారుడి పెళ్లికి చంద్ర‌బాబు, లోకేష్ హాజ‌ర్యే అవ‌కాశం లేక‌పోలేదు.

ఇక మొద‌టి వివాహ ఆహ్వాన ప‌త్రిక‌ను ష‌ర్మిళ త‌న అన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి (jagan mohan reddy) కూడా ఇచ్చారు. కొంత‌కాలంగా స‌త్సంబంధాలు లేక‌పోయిన‌ప్ప‌టికీ ఆడ‌ప‌డుచుగా వెళ్లి శుభ‌లేఖను ఇచ్చి వ‌చ్చారు. అయితే వారిద్ద‌రూ క‌లిసిన‌ట్లుగా ఒక్క ఫోటో కూడా బ‌య‌టికి రాలేదు. దాంతో అస‌లు క‌లిసారో లేదో అన్న అనుమానాల‌కు కూడా తావిస్తోంది.