Chandrababu Naidu: సీనియ‌ర్ల‌కు చంద్ర‌బాబు బిగ్ షాక్!

Chandrababu Naidu: తెలుగు దేశం పార్టీకి చెందిన ప‌లువురు సీనియ‌ర్లు.. అధినేత చంద్ర‌బాబు నాయుడుపై కోపంగా ఉన్నారు.  ఈరోజు చంద్ర‌బాబు నాయుడు 34 మంది అభ్య‌ర్ధులతో కూడిన రెండో జాబితాను రిలీజ్ చేసారు. ఇందులో టికెట్ కోసం ఆశిస్తున్న చాలా మంది సీనియ‌ర్ల పేర్లు లేవు. వారిలో గంటా శ్రీనివాస్ రావు, దేవినేని ఉమ కూడా ఉన్నారు. ఇప్ప‌టికే గంటా శ్రీనివాస్ రావు పార్టీ మారేందుకు స‌న్నాహాలు చేప‌డుతున్నార‌ట‌. మొద‌టి లిస్ట్‌లో ఆయ‌న పేరు లేక‌పోవడంతో క‌నీసం రెండో లిస్ట్‌లో అయినా ఉంటుంద‌ని అనుకున్న గంటా శ్రీనివాస్ రావు కొంత‌కాలంగా పార్టీలో అసంతృప్తితో ఉన్నారు.

క‌ళా వెంక‌ట్రావు, సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి, బండారు స‌త్యానారాయ‌ణ పేర్లు సెకండ్ లిస్ట్‌లో క‌నిపించ‌లేదు. క‌ళా వెంక‌ట్రావు ఎచ్చెర్ల టికెట్ ఆశించారు. విశాఖ నుంచి గంటా, పెందుర్తి నుంచి బండారు, మైల‌వ‌రం నుంచి బోండా ఉమ‌, స‌ర్వేప‌ల్లి నుంచి సోమిరెడ్డి టికెట్ ఆశించారు. అయితే రెండో జాబితాలోనూ వీరి పేర్లు లేక‌పోవ‌డంతో అసంతృప్తిలో ఉన్నారు. మ‌రోవైపు కృష్ణా జిల్లాలోని పెన‌మ‌లూరు టికెట్ రేసులో ఇంకా స‌స్పెన్ష‌న్ కొన‌సాగుతోంది.

టికెట్ ఆశలు పెట్టుకుని ప్రచారం ప్రారంభించిన బోడె ప్ర‌సాద్‌కు టికెట్ ఇవ్వ‌బోమ‌ని అధిష్ఠానం తేల్చి చెప్పింది. ఆయ‌న‌కు ఫోన్ చేసి అనివార్య కార‌ణాల వ‌ల్ల సీటు ఇవ్వ‌లేక‌పోతున్నామ‌ని చెప్పార‌ట‌. దీంతో బోడె ప్ర‌సాద్ ఆయ‌న అనుచ‌రులు తీవ్ర అస‌హ‌నంతో ఉన్నారు. బోడె ప్ర‌సాద్ స్థానంలో పెన‌మ‌లూరు టికెట్ రేసులో ప‌లువురి పేర్లు వినిపిస్తున్నాయి. దేవినేని ఉమని అనుకున్నారు కానీ స్థానికేత‌రుడు అనే అభ్యంత‌రాలు రావ‌డంతో తుమ్మ‌ల చంద్ర‌శేఖ‌ర్ పేరును ప‌రిశీలిస్తున్నారు.

ALSO READ: తిరుప‌తి టికెట్..ప‌వ‌న్ పోటీ చేస్తే ఓకే..!