Chandrababu: జ‌గ‌న్‌పై యాక్ష‌న్ ఎప్పుడు తీసుకుంటారు?

AP: ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై (ap cm jagan) BJP యాక్ష‌న్ ఎప్పుడు తీసుకుంటార‌ని ప్ర‌శ్నించారు TDP అధినేత చంద్ర‌బాబు నాయుడు (chandrababu). కుప్పం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చంద్ర‌బాబు మాజీ స‌ర్పంచులు, ఎంపీటీసీ స‌భ్యులు, కౌన్సిల‌ర్ల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. ఇప్ప‌టికే అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారిని అరెస్ట్ చేయించ‌డంలో ముందుండే BJP జ‌గ‌న్ విష‌యంలో ఎప్పుడు యాక్ష‌న్ తీసుకుంటుంద‌ని ప్ర‌శ్నించారు. ఇటీవ‌ల కేంద్ర మంత్రులు అమిత్ షా (amit shah), జేపీ నడ్డాలు (jp nadda) వ‌చ్చినప్పుడు కూడా జ‌గ‌న్ లాంటి అవినీతి ప‌రుడిని ఎక్క‌డా చూడ‌లేదని అన్నార‌ని అలాంట‌ప్పుడు అత‌నిపై యాక్ష‌న్ ఎప్పుడు తీసుకుంటార‌ని ప్ర‌శ్నించారు.