Chandra Kumar Bose: BJPకి బోస్ ముని మేన‌ల్లుడు బై బై

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు సుభాష్ చంద్ర బోస్ (subhash chandra bose) ముని మేన‌ల్లుడు చంద్ర‌కుమార్ బోస్ (chandra kumar bose) BJPకి గుడ్‌బై చెప్పేసారు. త‌న‌కు పార్టీలో ఎలాంటి స‌పోర్ట్ లేద‌ని అలాంటి చోట ఉండ‌లేన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఈ మేర‌కు కేంద్ర మంత్రి జేపీ న‌డ్డాకు (jp nadda) చంద్ర‌కుమార్ బోస్ లేఖ రాసారు. అందులో.. “” న‌న్ను పార్టీలో చేర్చుకునే ముందు మా ముని మేన‌మామ సుభాష్ చంద్ర బోస్ ఆలోచ‌న‌లను, భావజాలాన్ని ప్రచారం చేయడానికి నాకు అనుమతి ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. ఇందుకోసం ఆజాదీ హింద్ మోర్చాను స్థాపిస్తామ‌ని అన్నారు. ఈ మోర్చా ద్వారా అన్ని కులాల భార‌తీయుల‌ను ఏకం చేస్తామ‌ని చెప్పారు. అయితే, అలాంటిదేమీ జరగలేదు. అలాంట‌ప్పుడు నేను పార్టీలో ఉండి వేస్ట్. ఇప్ప‌టివ‌ర‌కు నేను ఎన్ని ఐడియాలు ఇచ్చినా కానీ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎలాంటి స‌మాధానం లేదు. అస‌లు ఎవ‌రూ విన‌లేదు కూడా “” అని లేఖ‌లో పేర్కొన్నారు బోస్ ముని మేన‌ల్లుడు. (chandra kumar bose)