EXCLUSIVE: 500 ఏళ్ల నాటి సంఘ‌ర్ష‌ణ‌కు తెర‌ప‌డ‌నుంది

EXCLUSIVE: కేంద్ర‌మంత్రి, తెలంగాణ రాష్ట్ర BJP అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డి (kishan reddy) అయోధ్య‌లో 22న జ‌ర‌గ‌బోయే రామయ్య ప్రాణ ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మానికి సంబంధించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. జ‌న‌వ‌రి 22న 500 ఏళ్ల నాటి క‌ల సాకారం కానుంది. వేలాది మంది బ‌లిదానాల‌కు 22న స‌మాధానం దొర‌క‌నుంది. భార‌త్‌లోనే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భార‌తీయులు 22న వ‌ర్చువ‌ల్‌గా రామ‌య్య ప్రాణ ప్ర‌తిష్ఠ‌ను వీక్షించ‌నున్నారు అని తెలిపారు.

మొత్తానికి రామ‌య్య‌కు నివాసం : కేదార్‌నాథ్ ప్ర‌ధాన‌ అర్చ‌కులు

ఎంద‌రో భ‌క్తులు, మునుల త‌పస్సు త‌ర్వాత మొత్తానికి రామ‌య్య‌కు అయోధ్య‌లో నివాసం ఏర్ప‌డ‌బోతోంద‌ని అన్నారు కేదార్‌నాథ్ ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు సంతోష్ త్రివేది తెలిపారు. ప్రాణ ప్ర‌తిష్ఠ కోసం కోట్లాది మంది భ‌క్తులు ఎదురుచూస్తున్న‌ట్లు తెలిపారు.