KCR: కేంద్రం ఉప్ప‌ల్ రోడ్డును వేయదు.. మనమే వేద్దాం!

Hyderabad: ఉప్ప‌ల్ – నార‌ప‌ల్లి ఎలివేటెడ్ కారిడార్ ప‌నులు ప్రారంభమై 5 సంవత్సరాలు అయినా కేంద్రం నిర్ల‌క్ష్యం కారణంగా ఆలస్యం కావడంపై సీఎం KCR అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. కేంద్రం రోడ్డు వేయ‌దు మ‌న‌మే వేసుకుందాం అని పిలుపునిచ్చారు. ప్ర‌జ‌ల సౌక‌ర్యం కోసం బీటీ రోడ్డు వేయాల‌ని R&B మినిస్ట‌ర్ KCR ఆదేశించారు. వెంట‌నే ప‌నులు ప్రారంభించాల‌ని సూచించారు. ఈ నేప‌థ్యంలో KCRకు మంత్రి మ‌ల్లారెడ్డి, పీర్జాదిగూడ మేయ‌ర్ జ‌క్క వెంక‌ట్ రెడ్డి ధ‌న్య‌వాదాలు తెలిపారు.