Electoral Bonds: పారిశ్రామిక‌వేత్త‌ల‌ను బెదిరించి పార్టీకి ఫండ్స్‌?

case on nirmala sitharaman over Electoral Bonds

Electoral Bonds: కేంద్ర‌మంత్రి నిర్మలా సీతారామ‌న్‌పై కేసు న‌మోదైంది. లోక్ స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీకి ఫండ్స్ కావాల‌న్న ఉద్దేశంతో ఎల‌క్టోర‌ల్ బాండ్స్ పేరిట ప‌లువురు పారిశ్రామికవేత్త‌ల‌ను ఆమె బెదిరించార‌ట‌. అలా బెదిరింపుల‌కు గురించేసి వారి నుంచి న‌గ‌దు సేక‌రించి పార్టీ ఫండ్స్ కోసం సాయం చేసారంటూ కోర్టు ఆదేశాలు ఇవ్వ‌డంతో బెంగ‌ళూరులోని తిల‌క్‌న‌గ‌ర్ పోలీసులు కేసు న‌మోదు చేసారు.