Telangana Lok Sabha Elections: జ‌గ‌న్ గెలుస్తాడ‌ని చెప్పి.. డిపాజిట్లు కోల్పోయిన‌ BRS

brs party is no where seen in telangana lok sabha elections

Telangana Lok Sabha Elections: రెండు వారాల క్రితం వివిధ ప్రెస్‌మీట్ల‌లో తండ్రీకొడుకులైన‌ KCR, KTR తమకి సంబంధం లేని ఆంధ్ర రాజ‌కీయాల విష‌యంలో నోటి దూల ప్రదర్శించారనే చెప్పాలి. తెలంగాణ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత ఇప్పుడు రైతుల కోసం యాత్ర అంటూ కేసీఆర్ బ‌స్సు యాత్ర‌లు చేప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆంధ్రప్ర‌దేశ్‌లో ఎవ‌రు గెలిచే అవ‌కాశాలు ఉన్నాయి అని అడిగిన ప్ర‌తీసారి.. నాకున్న స‌మాచారం ప్ర‌క‌రాం మ‌ళ్లీ జ‌గ‌నే గెల‌వ‌బోతున్నారు అని ఇద్ద‌రికి ఇద్ద‌రు ఒక‌టే డైలాగ్ కొట్టేవారు. ఇప్పుడు చూస్తే తెలంగాణ లోక్ స‌భ ఎన్నిక‌ల్లో BRSకి 0 సీట్లు వ‌చ్చాయి. పోటీ చేసిన దాదాపు అన్ని చోట్లా డిపాజిట్లు కూడా గ‌ల్లంత‌య్యాయి.