BRS: గుంటూరులో బీఆర్ఎస్ కార్యాలయం!

Guntur: ఆంధ్రప్రదేశ్ లో(ap) భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని గుంటూరులో(guntur) ఏర్పాటైంది. ఐదు అంతస్తుల భవనంలో ఏర్పటైన పార్టీ ఆఫీసును BRS ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ ఆదివారం ప్రారంభించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీలోని వివిధ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు తరలి వచ్చారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాల్లో వేగం పెంచారు. ఈ క్రమంలోనే గుంటూరులో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఐదు అంతస్తుల ఈ భవనంలో మొదటి అంతస్తులో కార్యకర్తలతో సమావేశ మందిరం, రెండు మూడు అంతస్తులలో పరిపాలన విభాగాలకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ పార్టీకి విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది అని ఆయన పేర్కొన్నారు.