Telangana Polling: BRSకే ఓటు వేయాల‌ని చెప్పిన క‌విత‌.. ఈసీ ఫైర్

Telangana Polling: ఎమ్మెల్సీ క‌విత (kalvakuntla kavitha) ఉద‌యాన్నే త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. బంజారా హిల్స్‌లోని DAV పాఠ‌శాల‌లో పోలింగ్ బూత్ ఏర్పాటుచేయ‌డంతో అక్క‌డ ఉంటున్న ప్ర‌ముఖులంతా ఈ బూత్‌కే వ‌చ్చి ఓటు వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో క‌విత ఓటు వేసి బ‌య‌టికి వ‌స్తూ లైన్‌లో నిల‌బ‌డి ఉన్న ఓట‌ర్ల‌కు BRS పార్టీకే ఓటు వేయాల‌ని చెప్పార‌ట‌. దాంతో కాంగ్రెస్ నేత‌లు ఈసీకి ఫిర్యాదు చేసారు. క‌విత BRS పార్టీకి ఓటు వేయాల‌ని ఓట‌ర్ల‌కు చెప్తున్న‌ప్పుడు వీడియో కూడా తీసామ‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ అధికారి వికాస్ రాజ్‌కు (vikas raj) ఫిర్యాదు చేసారు.