BRS: ఎన్నిక‌ల‌కు ముందు ఈ లొల్లేంది?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు (telangana elections) ముందు ప‌లువురు BRS నేత‌లు వారిలో వారే కొట్టుకుంటున్నారు. ఇప్పుడు జనగామలో BRS నాయకుల కొట్లాట జ‌రుగుతోంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మ‌ధ్య పోరు న‌డుస్తోంది. పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ముత్తిరెడ్డి తీవ్ర విమర్శలు చేసారు. “” జయప్రద అనే మీ అక్కకు చెందిన ఇంజనీరింగ్ కాలేజీలు లాక్కొని ఆమెను మానసిక వేదనకు గురి చేశావు. జనగామ నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులను డబ్బులతో కొనుగోలు చేస్తూ పార్టీని మలినం చేస్తున్నారు. జనగామ ప్రజలతో సంబంధం లేని వ్యక్తివి, నీవు ఎలా సేవా చేస్తావో చెప్పాలి “” అంటూ ఆరోప‌ణ‌లు చేసారు. తాను భూ కబ్జాలకు పాల్పడినట్లు నిరూపిస్తే ప్రాణత్యాగానికైనా సిద్దమని అన్నారు.