Botsa Satyanarayana: 3 రాజ‌ధానుల‌కే క‌ట్టుబ‌డి ఉన్నాం..మార్చుకుంటే మార్చుకుంటాం

Botsa Satyanarayana says ysrcp still stands with 3 capital agenda

Botsa Satyanarayana:  ఒక రాష్ట్రానికి రాజ‌ధాని అనేది కీలక అంశం. కానీ ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్కించుకోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ విష‌యం బొమ్మ‌లాట అయిపోయింద‌ని ఆ పార్టీ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట‌ల్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తిపై మీ అభిప్రాయం ఏంటి మీడియా అడిగిన ప్రశ్న‌కు బొత్సా స‌మాధానం ఇస్తూ.. తమ పార్టీ ఇప్ప‌టికీ మూడు రాజ‌ధానుల మాట మీదే నిల‌బ‌డి ఉంద‌ని.. ఎప్ప‌టికీ త‌మ నిర్ణ‌యం మార‌ద‌ని అన్నారు. ఒక‌వేళ తాము మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే అమ‌రావ‌తిని రాజ‌ధానిగా తీసేసి వైజాగ్‌ను అస‌లు రాజ‌ధానిగా మార్చుకుంటామ‌ని అన్నారు. ఒక‌వేళ త‌మ పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలిచి మూడు రాజ‌ధానుల పాల‌సీ వ‌ద్దు అంటే అప్పుడు త‌మ నిర్ణ‌యాన్ని మార్చుకుంటామ‌ని స్ప‌ష్టం చేసారు.