Telangana: BJP సీనియ‌ర్ నేత‌ల‌ అల‌క‌..పార్టీ వీడ‌తారా?

Hyderabad: BJP తెలంగాణ సీనియ‌ర్ నేత‌లు అలిగిన‌ట్లు తెలుస్తోంది. BJP తెలంగాణ (telangana) అధ్య‌క్షుడిగా, క‌రీంన‌గర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి, డీకే అరుణకు (dk aruna) రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి, ఈటెల రాజేందర్‌కు (etela rajender) ప్రచార కమిటీ ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేప‌థ్యంలో పార్టీలో సీనియర్లుగా ఉన్న తమకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదని విజయశాంతి (vijaya shanthi), గడ్డం వివేక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఏపీ జితేందర్రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, విఠల్, రవీంద్రనాయక్, దేవయ్య అలిగార‌ట‌. వీరంతా కలిసి జితేందర్ రెడ్డి ఇంట్లో సమావేశం అయ్యారు. కొద్దిరోజులుగా కేంద్ర నాయకత్వం మీద గుర్రుగా ఉన్న వీరు ఈ భేటీతో బీజేపీని వీడ‌తారేమోన‌న్న అనుమానాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. అదే నిజం అయితే.. వీరంతా తెలంగాణ‌లో కీల‌క‌మైన నేత‌లు కాబ‌ట్టి వ‌చ్చే తెలంగాణ ఎన్నిక‌ల్లో వ‌చ్చే అర‌కొర ఓట్లు కూడా BJPకి రావని తెలుస్తోంది.