Purandeswari: వారిని అరెస్ట్ చేసే ద‌మ్ము జ‌గ‌న్‌కి ఉందా?

అధికారంలోకి వ‌చ్చాక ఏపీలో మ‌ద్యం అమ్మేవారిని సేవించేవారిని అరెస్ట్ చేయించి ఏడేళ్లు శిక్ష ప‌డేలా చేస్తాన‌ని ప్ర‌చారం చేసిన ఏపీ సీఎం జ‌గ‌న్‌కు (ap cm jagan)  ఇప్పుడు వారిని అరెస్ట్ చేసే ద‌మ్ముందా అని ప్ర‌శ్నించారు ఏపీ BJP రాష్ట్ర అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి (purandeswari). YSRCP నేత‌లు ప్రెస్ మీట్లు పెట్టి మొత్తం ఏపీలో మ‌ద్యం సేవిస్తున్న‌వారి సంఖ్య కేవ‌లం 40 ల‌క్ష‌లు మాత్ర‌మే ఉంద‌ని త‌ప్పుడు లెక్క‌లు చూపిస్తున్నార‌ని మండిప‌డ్డారు. నిజానికి దాదాపు 5 కోట్ల‌కు పైగా జ‌నాభా ఉన్న ఏపీ రాష్ట్రంలో మ‌ద్యం సేవించే వారి సంఖ్య కోటి పైనే ఉంద‌ని అన్నారు. గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) ప్ర‌భుత్వంలో ఏపీలో 8 వైన్ షాపులకు అనుమ‌తి ఇస్తే ఇప్పుడు జ‌గ‌న్ మ‌రో 20 వైన్ షాపుల‌కు అనుమ‌తి ఇచ్చార‌ని ఆరోపించారు. ద‌మ్ముంటే YSRCP నాయ‌కులు మ‌ద్యం షాపుల ఓన‌ర్ల వివ‌రాల‌ను ప్ర‌జాక్షేత్రంలో పెట్ట‌గ‌ల‌రా అని స‌వాల్ విసిరారు.