భార‌త్‌లోనే అత్య‌ధిక మెజారిటీతో గెలిచిన నేత ఈయ‌నే

bjp leader from indore won with 11,75,092 votes

Lok Sabha Elections: లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఇదో అరుదైన రికార్డ్ అనే చెప్పాలి. వంద‌లు, వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన‌, ఓడిన వారిని చూసాం కానీ.. ఏకంగా 11 ల‌క్ష‌ల ఓట్ల మెజారిటీతో గెలిచి చూపించారు శంక‌ర్ లాల్వాణీ. ఈయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎంపీ. మ‌ధ్యప్ర‌దేశ్‌లోని ఇందౌర్ నుంచి పోటీ చేసి 11,75,092 ఓట్ల‌తో గెలిచారు. ఇక్క‌డ మ‌రో రికార్డు ఉందండోయ్.. ఇదే ప్రాంతంలో నోటాకు ప‌డిన ఓట్లు 2,18,674.