గెలిచిన ఎంపీల‌ను రాజీనామా చేయ‌మన్న‌ BJP

BJP: అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాజ‌స్థాన్‌లోనూ విజ‌య దుందుభి మోగించింది BJP. ఏడుగురు సిట్టింగ్ ఎంపీల చేత పోటీ చేయించగా వారిలో న‌లుగురు గెలిచారు మిగ‌తా ముగ్గురు ఓడిపోయారు. గెలిచిన‌వారిలో దియా కుమారి, రాజ్య‌వ‌ర్ధ‌న్ రాథోడ్‌, బాబా బాల‌క్‌నాథ్, కిరోడి లాల్ మీనాలు ఉన్నారు. అయితే ఈ న‌లుగురినీ ఎంపీ ప‌ద‌వుల నుంచి రాజీనామా చేయాల్సిందిగా హైక‌మాండ్ ఆదేశించింది. ఈ న‌లుగురిలో ఎవ‌రో ఒక‌రికి రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోప‌క్క రాజ‌స్థాన్ సీఎం రేసులో మాజీ సీఎం వ‌సుంధ‌ర రాజే కూడా ఉన్నారు. మ‌ళ్లీ ఆమెకే సీఎం బాధ్య‌త‌లు అప్ప‌గించాలని దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు స‌పోర్ట్ చేస్తున్నారు.