విశాఖలో YSRCPకి బిగ్ షాక్

big shock to ysrcp in visakhapatnam

YSRCP: విశాఖ‌ప‌ట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు భారీ షాక్ త‌గిలింది. దాదాపు 14 మంది వైసీపీ కార్పొరేట‌ర్లు తెలుగు దేశం పార్టీలో చేరారు. దాంతో పార్టీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌ప‌ట్టుని కూర్చున్న‌ట్లు స‌మాచారం. కార్పొరేట‌ర్లు తెలుగు దేశం పార్టీలోకి వెళ్లేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ని తెలీగానే మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ వారితో స‌మావేశం అయ్యారు. జీవీఎంసీలో ఇప్ప‌టివ‌ర‌కు అన్ని స్థాయుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గెలుస్తూ వ‌చ్చింద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్య‌ర్ధుల్నే గెలిపించాల‌ని కోరారు. కాబ‌ట్టి ఎవ్వ‌రూ కూడా తొంద‌ర‌ప‌డి కూట‌మిలోకి వెళ్లొద్ద‌ని ఆయ‌న అభ్య‌ర్ధించారు. కానీ అమ‌ర్నాథ్ మాట‌ల‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు.