EXCLUSIVE: జ‌న‌సేన నేత‌లు ఎందుకు.. అఖిల ప్రియ మండిపాటు

EXCLUSIVE: తెలుగు దేశం పార్టీ (TDP) అధినేత చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) చేప‌డుతున్న రా క‌ద‌లిరా కార్యక్ర‌మం ప‌ట్ల TDP నేత అఖిల ప్రియ (akhila priya) మొండిప‌ట్టు ప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి జ‌న‌సేన (janasena) నేత‌లు ఎందుకు వ‌స్తున్నారు? వారేమీ స్టేజ్‌పైకి రావాల్సిన అవ‌స‌రం లేదు అని చిర్రుబుర్రులాడుతున్నారు.

మ‌రోప‌క్క వైవీ సుబ్బా రెడ్డి (yv subba reddy) వ‌స్తే కూడా తాను ఈ కార్య‌క్ర‌మానికి రాను అని తెగేసి చెప్పింది. చంద్ర‌బాబు స‌భ‌కు వైవీ సుబ్బారెడ్డి వ‌స్తే తాను చ‌చ్చినా రాను అని కార్య‌క‌ర్త‌ల‌తో అన్నార‌ట‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో సుబ్బారెడ్డి, అఖిల్ ప్రియ‌ల వివాదం పార్టీకి త‌ల‌నొప్పిగా మారింది. త‌న మాట‌లు ప‌ట్టించుకోకుండా వైవీ సుబ్బారెడ్డి వ‌స్తే మాత్రం క‌చ్చితంగా ర‌చ్చ జ‌రుగుతుంద‌ని తాను మౌనంగా ఉన్నా త‌న కార్య‌క‌ర్త‌లు, అనుచ‌రులు మాత్రం అస్స‌లు ఊరుకోర‌ని బెదిరిస్తున్నారు.