Bhatti Vikramarka: న‌న్ను అవ‌మానించే ధైర్యం ఎవ‌రికి ఉంది?

Bhatti Vikramarka: తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌కు యాదాద్రి ఆల‌యంలో అవమానం జ‌రిగిందంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై ఆయ‌న స్పందించారు. నిన్న తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌లు కుటుంబ స‌మేతంగా యాదాద్రి ఆల‌యానికి వెళ్లారు. ఆ స‌మ‌యంలో మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ను నేల‌పై కూర్చోపెట్టారంటూ ప‌లువురు BRS నేత‌లు ఆరోపించారు. దీనిపై విక్రామార్క్ స్పందించారు.

తాను ప్రభుత్వంలో అత్యంత కీలకమైన శాఖల్ని నిర్వహిస్తున్నానని … తనను అవమానించేవారు ఎవరూ లేరని …. తానే కావాలని చిన్న పీట మీద కూర్చున్నానని స్పష్టం చేశారు. భట్టి క్లారిటీతో ఆయనకు అగౌరవం జరిగిపోయిందని బాధపడిపోయిన BRS నేతలకు షాక్ తగిలినట్లయింది.