భార‌త్‌లోనూ బంగ్లాదేశ్ త‌ర‌హా అల్ల‌ర్లు.. కాంగ్రెస్ నేత షాకింగ్ వ్యాఖ్య‌లు

bangladesh like situation in india too says congress leader

Congress: భార‌త్‌లోనూ బంగ్లాదేశ్ త‌ర‌హా అల్ల‌ర్లు జ‌రుగుతాయ‌ని కాంగ్రెస్ నేత స‌జ్జ‌న్ వ‌ర్మ వ్యాఖ్యానించ‌డం వివాదాస్ప‌దంగా మారింది. బంగ్లాదేశ్‌లో యువ‌కులు మాజీ ప్ర‌ధాని షేక్ హ‌సీనా ఇంట్లోకి చొర‌బ‌డిన‌ట్లు.. భార‌త్‌లోనూ యువ‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నివాసంలోకి చొర‌బ‌డే రోజులు ద‌గ్గ‌ర్లో ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో అక్ర‌మాలు జ‌రిగాయంటూ వ‌ర్మ ధ‌ర్నాకు దిగారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. “” గుర్తుపెట్టుకో మోదీ.. నిన్న బంగ్లాదేశ్ ప్ర‌ధాని ఇంట్లోని ప్ర‌జ‌లు ఎలా చొర‌బ‌డ్డారో రేపు మీ నివాసంలోకి అలాగే చొరబ‌డి మీకు బుద్ధి చెప్తారు.  గ‌తంలో శ్రీలంకలో కూడా ఇదే జ‌రిగింది. మీ విధానాల ప‌ట్ల ప్ర‌జ‌లు సంతోషంగా లేరు. మొన్న శ్రీలంక‌, నిన్న బంగ్లాదేశ్, రేపు భార‌త్‌కు ఈ దుస్థితి ప‌డుతుంది “” అని వ్యాఖ్యానించారు.