Bandi Sanjay: టెర్రరిస్టులకు, కాంగ్రెస్ నేతలకు తేడా ఏముంది?

Bandi Sanjay: టెర్రరిస్టులకు, కాంగ్రెస్ నేతలకు తేడా ఏముంది అని విమ‌ర్శ‌లు గుప్పించారు BJP ఎంపీ బండి సంజ‌య్. విభజించు, పాలించు అనేది కాంగ్రెస్ పార్టీ నినాదమ‌ని అన్నారు.

2012లో రాజీవ్ గాంధీనా?

2012లో రాజీవ్ గాంధీ సైతం భారతీయుడిగా చెప్పుకునేందుకు సిగ్గు పడుతున్నా అని అన్నార‌ట‌. ఈ మాట ఎవ‌రో కాదు బండి సంజ‌యే అన్నారు. అస‌లు ఏం మాట్లాడాలో తెలీన‌ప్పుడు ఏదో ఒక వంక‌తో వైర‌ల్ అవ్వాల‌ని సంజ‌య్ అనుకుంటూ ఉంటారు. అందుకే టాపిక్ లేక‌పోయినా ఇలా ఏదో ఒకటి మాట్లాడేసి చ‌నిపోయిన‌వాళ్ల‌ను కూడా బ‌తికించేస్తుంటారు.