Bandi Sanjay: మాట విన‌కపోతే KCR చేత‌బ‌డి చేయిస్తాడు

BRS నేత‌లు ఎవ‌రైనా KCR చెప్పిన‌ట్లు విన‌క‌పోతే వారిపై చేత‌బ‌డి చేయించి విఫ‌ల‌మ‌య్యేలా చేస్తార‌ని ఆరోపించారు BJP ఎంపీ బండి సంజ‌య్ (bandi sanjay). “” KCRకి సొంత ప్ర‌భుత్వంపై ఎలాంటి ఆలోచ‌న లేదు. నిరుద్యోగ యువ‌త జీవితాల‌తో ఆడుకుంటున్నారు. తొమ్మిదేళ్ల పాల‌న‌లో ఒక్క‌సారి కూడా గ్రూప్1 ప‌రీక్ష‌లు స‌క్ర‌మంగా నిర్వ‌హించింది లేదు. BRS నేత‌ల ద‌గ్గ‌ర అక్ర‌మంగా పోగైన న‌ల్ల‌ధ‌నం కోట్ల‌ల్లో ఉంది. ద‌ళిత బంధు, ద‌ళిత స్కీముల పేరుతో ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌ను ఊరించి త‌మ పార్టీలోకి లాక్కోవాల‌ని చూస్తున్నారు. ఇప్ప‌టికే BRSలోకి వెళ్లిన BJP నేత‌లు తమ త‌ప్పు తెలుసుకుని మ‌ళ్లీ BJPలోకి రావాల‌నుకుంటున్నారు. ఇప్ప‌టికైనా KCR గ్రూప్ 1 ర‌ద్దు చేసినందుకు యువ‌త‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పి వారికి ప‌రిహారంగా రూ.1 ల‌క్ష ఇవ్వాలి. దాంతో పాటు వారికి నిరుద్యోగ భృతి కూడా క‌ల్పించాలి. ఈ మధ్య‌కాలంలో KCR వేరే రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తూ.. తను చెప్పిన‌ట్లు విన‌ని నేత‌లు బాగుప‌డ‌కూడ‌ద‌ని క్షుద్రపూజ‌లు, చేత‌బ‌డి చేయిస్తున్నాడు “” అంటూ షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు బండి. (bandi sanjay)