Bandi sanjay: ఈటెల‌పై బండి పంచులు

Hyderabad: BJP నేత ఈటెల రాజేంద‌ర్‌పై (etela rajender) కరీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజయ్ (bandi sanjay) పంచులు వేసారు. తాను తెలంగాణ BJP అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడు ఈటెల రాజేంద‌ర్ దిల్లీకి పోయి త‌ప్పుడు ఫిర్యాదు చేసార‌ని ఇప్పుడు కిష‌న్ రెడ్డి ఆ ప‌ద‌విలో ఉన్నారు కాబ‌ట్టి క‌నీసం ఆయ‌న పైన అయినా త‌ప్పుడు ఫిర్యాదులు ఇవ్వ‌డం మానేయండి అని రిక్వెస్ట్ చేసారు. ఈటెల త‌ప్పుడు ఫిర్యాదుల వ‌ల్లే త‌న‌ను BJP అధ్య‌క్ష ప‌దవి నుంచి తీసేసార‌ని ఇన్‌డైరెక్ట్‌గా బండి సంజ‌య్ పంచులు వేసారు. మరోప‌క్క కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి (komatireddy venkata reddy) మాట్లాడుతూ.. బండి సంజ‌య్‌ను అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డంతో తాను బాత్రూమ్‌కు వెళ్లి మ‌రీ ఏడ్చాన‌ని అన్నారు. మొత్తానికి ఈరోజు కిష‌న్ రెడ్డి (kishan reddy) BJP తెలంగాణ అధ్య‌క్షుడిగా ప్ర‌మాణ స్వీకారం చేసారు.