Bandi Sanjay: తాత రాముడ్ని.. మ‌న‌వ‌డు స‌నాత‌న ధ‌ర్మాన్ని ..!

స‌నాతన ధ‌ర్మాన్ని మ‌లేరియా, డెంగూల‌తో పోల్చిన DMK నేత ఉద‌య‌నిధి స్టాలిన్ (udayanidhi stalin) వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని లేదంటే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు BJP క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ (bandi sanjay). ప్ర‌స్తుతం అమెరికాలోని నార్త్ కాలిఫోర్నియాలో ప‌ర్య‌టిస్తున్న బండి.. ఉద‌య‌నిధి కామెంట్స్‌పై మండిప‌డ్డారు. ఒక‌ప్పుడు ఉద‌య‌నిధి తాత‌గారు క‌రుణానిధి రాముడు ఓ ఇంజినీర్ అని అన్నాడ‌ని.. ఇప్పుడు మ‌న‌వ‌డు సనాత‌న ధ‌ర్మాన్ని అంటున్నాడ‌ని విమ‌ర్శించారు.

ఈ మ‌ధ్య‌కాలంలో ఇండియా కూట‌మిలో ఉన్న‌వారికి హిందూ ధ‌ర్మాన్ని విమ‌ర్శించడం ఫ్యాష‌న్ అయిపోయింద‌ని.. గ‌తంలో BJPకి చెందిన నుపూర్ శర్మ‌, రాజా సింగ్‌లు ఇలాంటి వ్యాఖ్య‌లు చేసినందుకు హై క‌మాండ్ వారిని స‌స్పెండ్ చేసింద‌ని మ‌రి ఇప్పుడు కాంగ్రెస్ DMKని ఇండియా కూట‌మి నుంచి తొల‌గిస్తుందో లేదో చూస్తామ‌ని అన్నారు. వారిపై ఎటువంటి యాక్ష‌న్ తీసుకోక‌పోతే కాంగ్రెస్‌కి కూడా స‌నాత‌న ధ‌ర్మంపై న‌మ్మ‌కం లేద‌నే ఒప్పుకోవాల్సి వ‌స్తుంద‌ని అన్నారు. (bandi sanjay)