Bandi Sanjay: TTDకి వీర‌ప్ప‌న్ వార‌సుల నుంచి విముక్తి

bandi sanjay compares ysrcp with veerappan

Bandi Sanjay:  తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వీర‌ప్ప‌న్ వార‌సుల హ‌స్తాల నుంచి బ‌య‌ట‌ప‌డింద‌ని అన్నారు భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత బండి సంజ‌య్. ఈరోజు ఆయ‌న శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం మీడియాతో స‌మావేశం అయ్యారు.

“” ఇప్పుడు తిరుమ‌ల‌లో ప్ర‌శాంత‌మైన వాతావ‌రణం ఉంది. మొన్న‌టివ‌ర‌కు దేవుడిని న‌మ్మని వారు ధ‌ర్మం గురించి ఆలోచించ‌ని వారు పేరుకు నామాలు పెట్టి స్వామివారి ఆస్తుల‌కు పంగ‌నామాలు పెట్టే న‌య‌వంచ‌కులు పోయి నిత్యం వెంక‌టేశ్వ‌ర నామ‌స్మ‌ర‌ణ‌తో సేవ చేసే వారి రాజ్యం వ‌చ్చింది. ఈరోజు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వీర‌ప్ప‌న్ వారసుల హ‌స్తాల నుంచి బ‌య‌ట‌ప‌డింది. మేం ఏ మ‌తానికి వ్య‌తిరేకం కాదు. కానీ హిందూ ధర్మానికి వ్య‌తిరేకంగా తిరుమ‌ల‌ను అప‌విత్రం చేయ‌డానికి కొంద‌రు ఆస్తిపాస్తులు పెంచుకునేందుకు కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు ప్రయ‌త్నించారు. రెండు కొండ‌ల వాడా గోవిందా గోవిందా అనే వ్య‌క్తులు పోయి ఏడుకొండ‌ల వాడా వెంక‌ట‌ర‌మ‌ణా గోవిందా గోవిందా అని స్మ‌రించే వారి పాల‌న‌లో శ్రీవారు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప‌రోక్షంగా సెటైర్లు వేసారు “” బండి సంజ‌య్