Ram Mohan Naidu: ప్ర‌త్యేక హోదా కంటే నాకు అదే ముఖ్యం

aviation minister Ram Mohan Naidu says railway zone for ap is his main demand

Ram Mohan Naidu: త‌న‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ద‌క్కాల్సిన ప్ర‌త్యేక హోదా కంటే రైల్వే జోన్ రావ‌డం ఎంతో కీల‌కం అని అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు. కేంద్రంపై త‌మ నుంచి ఎన్నో డిమాండ్లు ఉన్నాయ‌ని.. కానీ కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కే కేవ‌లం ప్ర‌త్యేక హోదా గురించి మాత్ర‌మే అడిగితే మిగ‌తా డిమాండ్లు ఆగిపోతాయ‌ని ఆయ‌న అభిప్రాయ‌పడ్డారు.

“” ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా అవ‌స‌ర‌మే. దాని కోసం త‌గినంత కృషి చేస్తాం. కానీ ప్ర‌త్యేక హోదా కంటే ముందు నా ల‌క్ష్యం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఓ రైల్వే జోన్ రావ‌డం. ఎందుకంటే ఉత్త‌ర ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాకు రైల్వే జోన్‌ను తీసుకురావ‌డం ఎంతో ముఖ్యం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రాజ‌ధాని లేదు. దాంతో అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించాం. దీని గురించి కూడా కేంద్రంలో పోరాడాల్సి ఉంటుంది. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోల‌వ‌రం కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. అలా కాకుండా కేవ‌లం ప్ర‌త్యేక హోదా అడిగితే అది రాజ‌కీయ ఆలోచ‌న అవుతుంది “” అని తెలిపారు.