AP Elections: ఐపాయ్‌..!

AP Elections: తెలంగాణ‌లో ఉచిత బ‌స్సు ప‌థ‌కం అమ‌ల్లో ఉన్న నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా అమ‌లు చేయాల‌ని సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) ప్లాన్ చేస్తున్నారు. దాంతో ఆటో డ్రైవ‌ర్లు ఇలా పోస్ట‌ర్లు అంటించి ఇలా ధ‌ర్నాల‌కు దిగేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌రోప‌క్క వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వ‌స్తే ఈ ఉచిత బ‌స్సు ప‌థ‌కాన్ని ఏపీలో కూడా తీసుకొస్తామ‌ని నారా లోకేష్ ప్ర‌క‌టించారు. దాంతో ఇప్ప‌టి నుంచే ధ‌ర్నాల‌కు పాల్ప‌డితే ప్ర‌భుత్వం త‌మ గురించి ఆలోచించి నిర్ణ‌యం తీసుకుంటార‌ని ఆటో డ్రైవ‌ర్లు యోచిస్తున్నారు.