Ashwini Dutt: ఎన్నికల్లో 160 సీట్లు ‘చంద్రసేన’ వాయించేస్తారు

ప్ర‌ముఖ నిర్మాత అశ్వినీ ద‌త్ (ashwini dutt) ఈరోజు సాయంత్రం రాజ‌మండ్రి జైల్లో జ్యుడిషియ‌ల్ క‌స్టడీలో ఉన్న TDP అధినేత చంద్ర‌బాబు నాయుడుని (chandrababu naidu) క‌లిసారు. ఆయ‌న‌తో కాసేపు ములాఖాత్ అయ్యాక మీడియా ముందు మాట్లాడారు. రాబోయే ఎన్నిక‌ల్లో ఏపీలో చంద్రసేన (TDP జ‌న‌సేన‌) క‌లిసి 160 సీట్లు వాయించేస్తార‌ని ధీమా వ్య‌క్తం చేసారు. ఈ విష‌యంలో త‌న‌కు 200% న‌మ్మ‌కం ఉంద‌ని తెలిపారు.