Arvind Dharmapuri: రేవంత్ రెడ్డి కూడా BJPలోకి వస్తారు

Arvind Dharmapuri: కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్య నేతలంతా భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి (BJP) వస్తున్నారని ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ అన్నారు. జగిత్యాల జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. చివరికి తమ పార్టీలోకి తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కూడా వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌కి లోపల హిందుత్వం ఉన్నప్పటికీ ఏమీ చేయలేక పోతున్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతలకు ఎజెండా అంటూ ఏదీ లేదన్నారు. ప్రజలకు ఏం చేస్తారో వారు చెప్పట్లేదని.. ఓట్లు మాత్రం అడుగుతున్నారని దుయ్యబట్టారు.

మ‌రోప‌క్క కొంత‌కాలంగా లోక్ స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి జంప్ అయ్యేది రేవంతే అని భార‌త రాష్ట్ర స‌మితి (BRS) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోప‌ణ‌లు చేసారు. భార‌తీయ జ‌నతా పార్టీ ఎక్క‌డ త‌నపై కేసులు వేస్తుందో అని భ‌య‌ప‌డి ఆ పార్టీలోకి జంప్ అవుతార‌ని కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన నేప‌థ్యంలో అర్వింద్ ఇలా అన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ALSO READ:

https://telugu.newsx.com/tag/telangana-congress/