AP Volunteers: ప‌వ‌న్ సారీ చెప్పాల్సిందే

AP: ఏపీ వాలంటీర్ల‌పై (ap volunteers) షాకింగ్ కామెంట్స్ చేసిన జ‌న‌సేనాని ప‌వన్ క‌ళ్యాణ్ (pawan kalyan) వెంట‌నే క్ష‌మాపణ చెప్పాలంటూ వాలంటీర్లు ర‌చ్చ చేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అంతటా ధ‌ర్నాలు చేప‌డ‌తామ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు. ప‌వ‌న్ దిష్టిబొమ్మ‌ల‌ను త‌గ‌ల‌బెడుతున్నారు. వైజాగ్‌లో జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకుని సారీ చెప్పాలంటూ ఏపీ మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు పంపింది. వీలైతే సాక్ష్యాల‌తో రుజువు చేయాల‌ని లేదా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తోంది. లేదంటే మ‌హిళా క‌మిష‌న్ (woman commision) వెంటాడుతూనే ఉంటుంద‌ని వాసిరెడ్డి ప‌ద్మ (vasireddy padma) హెచ్చ‌రించారు. మ‌రి దీనిపై ప‌వ‌న్ ఏమ‌ని స్పందిస్తారో వేచి చూడాలి.