Harish Rao: కల్లు తాగి ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు

vijayawada: తెలంగాణ మంత్రి హరీష్‌రావు(minister harish rao) ఏపీ ప్రభుత్వం(ap government)పై చేసి వ్యాఖ్యలకు వైసీపీ మంత్రులు(ap ministers) గట్టిగా కౌంటర్‌(strong counter) ఇచ్చారు. ఇటీవల హరీషరావ్‌ మాట్లాడుతూ.. ఏపీ నుంచి వలస వచ్చే కార్మికులు.. తెలంగాణకు తమ ఓటు హక్కు మార్చుకోవాలని, ఇక్కడ ఏపీ కంటే మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. దీంతోపాటు వైసీపీ ప్రభుత్వం, పాలనపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు వరుసగా కౌంటర్‌ ఇచ్చారు. ఏపీ అన్నిట్లోనూ నంబర్‌ వన్‌ గా ఉందని, తెలంగాణాను చూసి నేర్చుకోవల్సిన అవసరం లేదని.. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు(karumuri nageswara rao) అన్నారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు.

ఇక మరో అడుగు ముందుకేసిన మంత్రి సీదిరి అప్పలరాజు(appalaraju).. హరీష్‌రావ్‌కు గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు. కేసీఆర్‌తోపాటు కల్లు తాగిన హరీష్‌రావు.. ఒళ్లు కొవ్వెక్కి ఏవేవో మాట్లాడుతున్నాడని అన్నారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హరీషను హెచ్చరించారు. కేసీఆర్‌ కుటుంబం అంతా ప్రాంతీయ ఉగ్రవాదులు అని అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ(botsa sathyanarayana) స్పందించారు. ఎవరుపడితే వారు చేసిన వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం లేదని. ఏ రాష్ట్రంలో వారు అక్కడ ఏమేరకు అభివృద్ధి జరిగిందో చూసుకోవాలన్నారు. ఎంఎల్‌సీ లేళ్ల అప్పిరెడ్డి(lella appireddy) కూడా మాట్లాడుతూ.. ఏ రంగంలో తీసుకున్నా ఏపీ ముందుందని, ఆర్థికంగా సామాజికంగా రాష్ట్రం ముందుకెళ్తోందన్నారు. నాలుగు చినుకులు పడితే హైదరాబాద్‌(hyderabad) సముద్రాన్ని తలపిస్తుందని.. ముందు ఆ హైదరాబాద్‌పై హరీష్‌రావు దృష్టి సారించాలన్నారు. ఇక మాజీ మంత్రి పేర్ని నాని(perni nani) స్పందిస్తూ.. ‘మా మీద నీకు అంత ప్రేమ ఉంటే. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారు. నోటితో ప్రేమతో చూపిస్తూ, నొసళ్లతో ఎక్కిరించే రకం కేసీఆర్‌(kcr), హరీష్‌రావ్‌’ అని విమర్శించారు.