పోలీసులు ఏమ‌న్నా ఇబ్బందిపెట్టారా.. చంద్ర‌బాబుని అడిగిన జ‌డ్జ్

రెండు రోజుల పాటు AP CID విచార‌ణ త‌ర్వాత ఈరోజు సాయంత్రం చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) వ‌ర్చువ‌ల్‌గా ఏసీబీ కోర్టు న్యాయ‌మూర్తితో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా AP ACB కోర్టు న్యాయ‌మూర్తి చంద్ర‌బాబుని ప‌లు ప్ర‌శ్న‌లు వేసారు. మీరు రెండు రోజుల పాటు CID క‌స్టడీలో ఉన్నారు? మీరు బాగానే ఉన్నారా? అధికారులు మిమ్మ‌ల్ని ఏమైనా ఇబ్బందిపెట్టారా? భ‌య‌ప‌డ‌కుండా మీరు నాకు చెప్ప‌వ‌చ్చు అని అడిగారు.

వీటికి చంద్ర‌బాబు నాయుడు స‌మాధానంగా.. అలాంటిదేమీ లేద‌ని.. తాను పూర్తిగా విచార‌ణ‌కు స‌హ‌క‌రించాన‌ని తెలిపారు. ఆ త‌ర్వాత న్యాయ‌మూర్తి మాట్లాడుతూ.. రెండు రోజుల విచార‌ణ‌కు సంబంధించిన నివేదికను పూర్తిగా ప‌రిశీలించిన త‌ర్వాత ఏ విష‌యం అనేది అక్టోబ‌ర్ 5న వెల్ల‌డిస్తాన‌ని తెలిపారు. దీనికి చంద్ర‌బాబు స్పందిస్తూ.. నివేదిక‌లో ఏమ‌ని తేలింది అని అడిగారు. అయితే.. దీనికి ఇప్పుడే సమాధానం చెప్ప‌లేన‌ని పూర్తిగా ప‌రిశీలించాక నివేదిక కాపీని ఇవ్వ‌మ‌ని AP CIDకి ఆదేశాలు జారీ చేస్తాన‌ని న్యాయ‌మూర్తి వెల్ల‌డించారు.