Congress: రాహుల్ పర్యటనకు ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

పెద్దపల్లిలో (peddapalli) రాహుల్ గాంధీ (rahul gandhi) పర్యటనకు ముందు కాంగ్రెస్ పార్టీకి (congress) బిగ్ షాక్ త‌గ‌లింది. కాంగ్రెస్ పార్టీకి TPCC సభ్యులు, ఓదెల ZPTC గంట రాములు యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ రెడ్డి, వేముల రామ్మూర్తి తదితరులు ముకుమ్ముడిగా రాజీనామా చేసారు. కాంగ్రెస్ పార్టీని జేబు సంస్థగా TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (revanth reddy) మార్చుకున్నాడ‌ని పర్సనల్ ఎజెండాతో పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని నాశనం చేసాడ‌ని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సర్వేలను మార్చి తనకు అనుకూలంగా రిపోర్టు తెప్పించుకున్నాడని. రాహుల్ గాంధీ స్వతహాగా మాట్లాడ‌కుండా రేవంత్ రాసిచ్చిందే చ‌దువుతున్నాడ‌ని అన్నారు. రాహుల్ గాంధీ మాటలను నియోజకవర్గ ప్రజలు నమ్మొద్దని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పార్టీలో గుర్తింపు లేనప్పుడు ఆత్మగౌరవం చంపుకొని ఉండలేమని అందుకే మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నామ‌ని తెలిపారు. (congress)