Pithani Balakrishna: ప‌వ‌న్‌పై మూడో భార్య ఫిర్యాదు..!?

Pithani Balakrishna: జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై (Pawan Kalyan) ఆయ‌న స‌తీమ‌ణి ఆన్నా లెజ్నోవా..(Anna Lezhnova) ఓ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసిన‌ట్లు షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు జ‌న‌సేన మాజీ నేత పితాని బాల‌కృష్ణ‌. ప‌వన్ మ‌రొక‌రితో సంబంధం పెట్టుకున్నార‌ని ఈ విష‌యంలో త‌న‌కు న్యాయం జ‌రిగేలా చేయాల‌ని ఆన్నా కేంద్ర మంత్రి ద‌గ్గ‌ర చెప్పుకుని బాధ‌ప‌డ్డార‌ని ఆరోపించారు.

ఎందుకు ఆన్నా కేంద్ర మంత్రి వ‌ద్ద‌కు వెళ్లి త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి ఫిర్యాదు చేస్తుంది అని ప్ర‌శ్నించ‌గా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఇప్పుడు భార‌తీయ జ‌న‌తా పార్టీతో మంచి స‌త్సంబంధాలు ఉన్నాయ‌ని.. ఈ విష‌యంలో వారు క‌ల‌గ‌జేసుకుని చివాట్లు పెడితేనే ప‌వ‌న్ వింటాడ‌ని భావించి ఫిర్యాదు చేసింద‌ని అన్నారు.

పార్టీ టికెట్ల‌ను ప‌వ‌న్ రూ.10 కోట్ల‌కు అమ్ముకున్నాడు అన‌డానికి త‌న ద‌గ్గ‌ర బ‌ల‌మైన ఆధారాలు కూడా ఉన్నాయ‌ని పితాని తెలిపారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కూడా రూ.10 నుంచి రూ.20 కోట్ల చొప్పున పార్టీ టికెట్లు అమ్ముకున్నాడ‌ని పితాని షాకింగ్ ఆరోప‌ణ‌లు చేసారు.