Andhra Pradesh: ఏపీకి మెట్రో.. జీవో జారీ

andhra pradesh to get a metro rail

Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మెట్రో రాబోతోంది. ఈ మేర‌కు కూట‌మి స‌ర్కార్ కొత్త ఎండీగా రామ‌కృష్ణారెడ్డిని నియ‌మిస్తూ జీవో జారీ చేసింది. ముందుగా విశాఖలో ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు మెట్రో రైలు నిర్మాణంపై ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల విశాఖ పర్యటనలో మెట్రో డిజైన్లు, డీపీఆర్, నిర్మాణ పనులపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కులాల వారీగా కాకుండా ప‌నిత‌నాన్ని బ‌ట్టి బాధ్య‌త‌లు ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది.